ద్విపదభాగవతం - మధురకాండ : గోపికలు శ్రీకృష్ణుని రూపును జేష్టలును వర్ణించుట
“నల్లని మేనునున్నతమైన యురముఁ
దెల్లదమ్ముల మించు తెలిగన్నగవయు
నెరిజడ చొళ్ళెము నిటల రేఖయును
జిరునవ్వుమోమును జేతవేణువును. - 400
నాయతబాహులు నధరంపుకెంపు
పాయక జగిమించు పసిఁడిచేలయును
viదలఁబురిసెనవు కదంబమంజరియు
ధళధళ వెలుఁగెడు దంతదీధితియుఁ
గలరూపు మోమున గట్టినట్లుండ
తలఁచకుండిన నుండు తలఁచిన నుండు
viiకలలందు మాతోడఁ గవయుచు నుండు
నెన్నడు వచ్చునో యిందిరావిభుఁడు
కన్నులాకలి తీర్పఁగలుగునో? అనుచుఁ
దరుణులు ప్రేమనుద్ధవుఁ జూచి మమ్ము
నెరవుగాఁ జూడక నిందు రమ్మనుచు
నిక్కడఁ గృష్ణుఁడు, ఇందఱుఁ జూడ
గొక్కెరరక్కసుఁ గూల్చిన చోటు;
గిరికొని యున్నది కేళిమైఁ జూడ
హరిచేత viiiగతజన్ముఁ డఘదైత్యు డొక్క;
యావులఁ గృపను మమ్మందఱిఁ గాచి
గోవిందుఁ డెత్తిన గోవర్థనాద్రి;
సఖులుఁ దానును శౌరి చల్దులు గుడిచి
సుఖలీల నుండిరి సురవొన్ననీడ; - 410
నీసైకతస్థలి నిందిరావిభుఁడు
రాసకేళిఁ జరించు రమణులుఁ దాను;
జల్లని యీరూపఛాయ మురారి
పిల్లగ్రొలూదు గోపికలాత్మమెచ్చ;
నాపొన్న క్రిందఁబో హరి వేడ్కలెల్ల
గోపికలలుక గ్రక్కున మ్రొక్కి తీర్చె;
బలభద్రుఁడును దాను బసుల మేపుచును
యలమి చిమ్మనబంతులచ్చట నాడు;
పొలుచు నీగురివింద పొదరిండ్లలోన
జలజలోచనఁ గ్రీడ సలిపి మాధవుఁడు
అమ్మాని నీడ నాకఱిఁ గౌఁగిలించి
తమ్మఁ బ్రసాదించె తామరసాక్షుఁ”
డని పెక్కుభంగుల హరి విచారములు